హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ డివిజన్ వైభవ్ నగర్ కాలనీ సీసన్స్ హసుపత్రి లైన్ లో జరుగుతున్న వర్షపు నీటి కాలువ, డ్రైనేజీ పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి, జలమండలి ఏ.ఈ. కుషాల్ తో కలిసి పర్యవేక్షంచారు.
జరుగుతున్న పనులను తొందరగా పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. సీసన్స్ సుపత్రి ఉన్నందున ఇక్కడికి వచ్చే 108 అత్యవసర వాహనాలకు ఇబ్బంది కలగకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ మాజీ అధ్యక్షులు బి.వెంకట్ రెడ్డి, బాగ్ అంబర్ పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు కోడూరి సురేష్ కుమార్, జమ్మిశెట్టి బాలరాజు పాల్గొన్నారు.