తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
వేద పండితులు వేద మంత్రాలతో తో కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి తో పాటుగా శ్రీ లక్ష్మీ సమేత నారాయణస్వామి శ్రీ చండీక సమేత సూర్యేస్వరస్వామి లతో కల్యాణం ప్రతి సంవత్సరం జరుగుతుంది.
దీనిలో భాగంగా ఆలయ ఈవో ప్రసాద్ , బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ దంపతులు పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించారు.
దీంతోపాటుగా స్వామివారికి కంకణాలు ధరించి వేద పండితుల మంత్రాలు, జీలకర్ర బెల్లం తో స్వామివారి తలపై ఉంచి,మంగళసూత్రం తరింప చేసి, మంచి ముత్యాల తలంబ్రాలతో స్వామి తలపై పోసి కళ్యాణం వైభవంగా జరిపించారు.
ఈ కళ్యాణ మహోత్సవం చూడ్డానికి చుట్టు పక్కల ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు తరలివచ్చి ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కళ్యాణం అనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదంతో పాటు స్వామి వారి తలంబ్రాలు మంచిముత్యాలు పంచారు.