హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలోని నింబోలి అడ్డ లోని సంగం హోటల్ నుండి గోల్నాక బ్రిడ్జి వరకు వేయతలపెట్టిన 300 ఎంఎం వాటర్ సప్లై పైప్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె నారాయణగూడ మంచినీటి జనరల్ మేనేజర్ సుబ్బారాయుడుని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి పైపులైన్లు పనులు ఆగిపోయాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటర్ పైప్ లైన్ లు జాయింట్లు కలపకపోవడం వలన మంచినీటి సరఫరా ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని ఆమె తెలిపారు. నింబోలి అడ్డా, నెహ్రూ నగర్, సుందర్ నగర్, నవాబ్ సబ్ వాడ, కృష్ణానగర్, న్యూ కృష్ణ నగర్, వడ్డీ కార్ఖానా, శాంనగర్, శాస్త్రి నగర్,లలో మంచినీటి ప్రాబ్లం చాలా ఉందని ఆమె తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన 300 ఎంఎం పైప్లైన్ లకు కనెక్షన్స్ ఇచ్చి మంచినీటి సరఫరా చేసి ప్రజలకు ఇబ్బందులు పడకుండా ఉండాలని అధికారులకు కోరారు. సత్యం న్యూస్, అంబర్పేట