మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నాచారం డివిజన్ పరిధిలోని పలు పలు కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ సాయి జన్ శాంతి శేఖర్ హామీ ఇచ్చారు.
డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కార్పొరేటర్ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరా సరిగ్గా లేదని అలాగే మురుగునీటి సమస్యలు, కూలిపోయిన మ్యాన్ హోల్ సమస్య లను తక్షణమే పరిష్కరించాలని జలమండలి డీజీఎం సతీష్ ను ఆదేశించారు.
డివిజన్ పరిధిలోని కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ సాయిబాబా , టిఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయి జన శేఖర్ , కట్ట బుచ్చన్న గౌడ్ , చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి