ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మీ ఇంటి పోయికాడికే మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఎత్తుపై ఉన్న బుస్సాపూర్ గ్రామానికి రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇరిగేషన్ పైపులైన్ల ద్వారా మీ పొలం వాకిట్లోకి సాగునీళ్లు త్వరలోనే తేనున్నామని ఆయన చెప్పారు. బుస్సాపూర్ గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు నేడు పాల్గొన్నారు. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవ సందర్భంగా రెండేళ్లుగా పెండింగులో ఉన్న వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ మీ బ్యాంకులలో జమ చేస్తామని మహిళా సంఘాలకు ఆర్థిక మంత్రి తీపి కబురు చెప్పారు. తల్లీ, బిడ్డ ఆరోగ్య రక్షణకు ఏఎన్ఏం, ఆశా కార్యకర్తలు సారథులని ఆయన అన్నారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యం ముఖ్యం. ఆపరేషన్లు వద్దు.. నార్మల్ డెలివరీలే ముద్దు అని మంత్రి అన్నారు.
previous post
next post