31.7 C
Hyderabad
April 25, 2024 00: 59 AM
Slider విశాఖపట్నం

రాజకీయాలలో ద్రోణంరాజు వారసత్వం కొనసాగించాలి

#SwarupanandendraSwamy

ఉత్తరాంధ్ర కు పెద్ద దిక్కుగా, పార్టీలకు అతీతంగా జీవించిన ద్రోణంరాజు సత్యనారాయణ, ఆయన కుమారుడు శ్రీనివాస్ వారసత్వం కొనసాగాలని శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానంద సరస్వతీ స్వామి ఆశించారు.

ద్రోణంరాజు శ్రీనివాస్ కుమారుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్ ఆదివారం విశాఖపట్నంలోని స్వామిజీ పీఠంలో ప్రముఖ రచయిత, నిర్మాత ద్రోణంరాజు శ్రీవత్సవ్ మేనమామ కోన వెంకట్ తో కలిసి స్వామిజీని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామిజీ ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపై తీవ్రంగా ఆవేదన వ్యక్తంచేశారు. ద్రోణంరాజు శ్రీనివాస్ తో స్వామిజీ కి ఉన్న సంబంధాన్ని ఈసందర్భంగా స్వామిజీ గుర్తుకు తెచ్చుకొని చాలా ఉద్వేగానికి లోనయ్యారు.

కచ్చితం గా ద్రోణంరాజు ఆలోచనలు, ఆశయాలు కొనసాగాలి అని స్వామిజీ ద్రోణంరాజు శ్రీవత్సవ్ ను దీవించారు.

ప్రజాసేవలో మంచి భవిష్యత్తుకు ఎదగాలి అని, దానికి తన ఆశీసులు ఎప్పుడు ఉంటాయి అని స్వామిజీ ఆశీసులు అందజేశారు.

Related posts

పక్కలో బల్లెం: రఘురామకు తోడు మరో ఇద్దరు

Satyam NEWS

రూ.55 కోట్లతో పాతకడప సుందరీకరణ పనులు

Satyam NEWS

కన్నీళ్ల మధ్య అన్న మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి

Bhavani

Leave a Comment