భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో డ్రోన్ కెమెరాలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
సరిగ్గా అలానే కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రంలో కూడా అర్ధరాత్రి సమయంలో డ్రోన్ కెమెరాలు కలకలం రేపుతున్నాయి.
రాత్రిపూట తిరుగుతున్న డ్రోన్ కెమెరాలు ఇప్పుడు ఆలయ పరిసరాల్లో అనుమానాస్పదంగా మారాయి. నాలుగు రోజులుగా రాత్రిపూట ఆకాశంలో డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొడుతున్నాయి.
డ్రోన్లను పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన దొరకలేదు.
దీంతో శ్రీశైలం చుట్టు ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్ పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి.