బడి బయట ఉన్న విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమాన్ని శ్రీకాకుళం సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి ఏ. పీ . ఓ. సుధాకర్ ప్రారంభించారు.
శ్రీకాకుళం పట్టణంలో స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఉదయం క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు, సమగ్ర శిక్ష ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆర్ట్ , క్రాఫ్ట్ , వ్యాయామ ఉపాధ్యాయుల ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఏప్రిల్ ఒకటో తారీకు వరకు బడిబయట ఉన్న విద్యార్థులను వారి డేటాను సేకరించి తిరిగి వారిని బడిలో చేర్పించే కార్యక్రమాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం మండలం విద్యాశాఖాధికారి జీ. కృష్ణారావు, సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న ఎం. ఐ. ఎస్. కోఆర్డినేటర్ ఎస్ . గౌరీశంకర్, సి. ఆర్. పి . కె రామకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయుడు గుండబాల మోహన్, శ్రీకాకుళం మండలంలో పనిచేస్తున్న సీ. ఆర్పీ. లు, ఆర్ట్ , క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.