డిఆర్ డిఓ కు చెందిన న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎల్లైడ్ సైన్సెస్ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తో కలిసి సంయుక్తంగా రూపొందించిన కరోనా మందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (జీసీజీఐ) అత్యవసర అనుమతులు మంజూరు చేసింది.
కరోనా పీడితులకు ఈ మందును నీటిలో కలిపి తాగిస్తే సరిపోతుంది. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. ఈ మందు కరోనా వైరస్ ఉన్న కణజాలంలోకి చొచ్చుకు వెళుతుంది. అక్కడ వైరస్ పెరుగుదలను అరికట్టి సమూలంగా నాశనం చేస్తుంది.
వైరస్ కణాల విభజనను, శక్తి విడుదలను అడ్డుకోవడం ద్వారా ఈ మందు వాటిని చంపేస్తుందని. 2 డాక్సీ డీ గ్లూకోజ్ (2డిజీ) పేరుతో పిలిచే ఈ మందును ఇప్పటికే పలువురు కరోనా వ్యాధిగ్రస్తులపై ప్రయోగించారు.
వారిలో మంచి ఫలితాలు వచ్చినట్లు వెల్లడి అయింది. ఈ మందు ఒక జనరిక్ మాలిక్యూల్ (కణజాలం), గ్లూకోజ్ నుంచి వేరు చేసిన ఎనలాగ్. దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.
దేశంలోని పలు ప్రాంతాలలో ఈ మందును అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మందును నీటిలో కలుపుకుని తాగడం వల్ల కరోనా నుంచి వేగంగా కోలుకునే అవకాశం ఉంది.
ఈ మందు వాడటం వల్ల కరోనా రోగులు వేగంగా కోలుకోవడమే కాకుండా ఆసుపత్రిలో ఉన్నంత కాలం ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన అవసరం కూడా అంతగా ఉండదు.
అంటే ఆక్సిజన్ చాలా తక్కువ మొత్తంలోనే అవసరం అవుతుంది. ఈ మందు వాడిన పేషంట్లకు అనతి కాలంలోనే ఆర్టీ పీసీఆర్ నెగెటీవ్ వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
గత ఏడాది ఏప్రిల్ నెలలో డిఆర్ డిఓ శాస్త్రవేత్తలు హైదరాబాద్ లోని సిసిఎంబి తో కలిసి పరిశోధనలు నిర్వహించగా ఈ మందు మంచి ఫలితాలను ఇచ్చినట్లు వెల్లడి అయింది.