విశాఖపట్నంలో డ్రగ్స్ వీరవిహారం చేస్తున్నాయి. సాక్షాత్తూ డీజీపీ సవాంగ్ విశాఖ పర్యనటలో ఉండగానే డ్రగ్స్ కలకలం రేగింది. టాస్క్ ఫోర్సు పోలీసులు డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. నలుగురు నిందితులు డ్రగ్స్ అమ్ముతూ టాస్క్ ఫోర్స్ పోలుసులకు పట్టుబడ్డారు. పోలీసులకు పట్టుబడ్డ వారిలో మానుకొండ సత్యనరాయణ, మజ్జి అజయ్ కుమార్, కంది రవికుమార్, కేతి మనోజ్ స్వరూప్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వీరిని పోలీసులు అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. నిందితుల నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లో 61 ఎల్ ఎస్ డీ స్టిక్కర్లు, 2.5 గ్రా. ఎమ్ డి ఎమ్ ఏ, 60 గ్రా. గంజాయి ఉన్నాయి. ఇవే కాకుండా రూ. 9,500 నగదు, నాలుగు మొబైల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో రెవ్ పార్టీ లో వాడిన మత్తు పదార్ధాలు మరో సారి ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఒక్క సారిగా ఉలికి పడ్డారు. భారీ మోతాదులో సరుకు విక్రయం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో రుషికొండ రేవ్ పార్టీ లో డ్రగ్స్ సరఫరా చేసిన మనికొండ సత్యనారాయణ మళ్లీ ఇప్పుడు అదే పనిలో పట్టుబడ్డాడు.