మద్యపానం చేసి వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు సైబరాబాద్ పరిధిలో నవంబర్ నెలలో తనిఖీలలో 6824 డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. ఫలితంగా మద్యం మత్తులో జరిగే ప్రమాదాలలో పెద్ద సంఖ్యలో తగ్గుదల కనిపించింది. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి పెద్ద సంఖ్యలో సిబ్బంది ద్వారా డ్రంక్ డ్రైవింగ్ టెస్ట్ లను నిర్వహిస్తున్నారు. అలాగే రెండు, మూడు పోలీస్ స్టేషన్ అధికారులను కలిపి మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ లను కూడా నిర్వహించారు. ఈ నెలలో 6824 నమోదు చేయగా అందులో 93 మందికి జైలు శిక్ష పడగా, 2,37,25,000/- జరిమానా విధించారు.
previous post