అమ్మ కనిపించే దైవం అంటారు. అమ్మను మించిన గురువు కూడా లేడంటారు. అయితే…. ఈ తాగుబోతు అవన్నీ మర్చిపోయాడు….. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో ఈ అతి కిరాతకమైన కొడుకు ఉన్నాడు. మాతృత్వాన్ని మరచి కన్న తల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్నఆ యువకుడి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
పల్లెపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు వృద్దాప్యం లో ఉన్న తన తల్లి లక్ష్మీ ని కింద పడవేసి కాళ్లతో తన్నుతున్నాడు. అంతేకాకుండా తల్లి పీక పై కాళ్ళు వేసి తొక్కుతూ మానవత్వం లేని మృగంగా ప్రవర్తిస్తున్నాడు. తాగిన మత్తులో ఈ యువకుడు తన తల్లిని ఇలా చిత్ర హింసలకు గురిచేయడం ఈ ప్రాంతంలో చర్చానీయాంశంగా మారింది. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఈ మానవ మృగం పై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలిసుకున్న బంధువులు వృద్దురాలిని యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.