పరిసరాల పరిశుభ్రం చేసుకునే డ్రై డే సందర్భంగా నేడు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వేపలసింగారం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులను నిర్వహించారు. గ్రామంలో నీరు నిలువ ఉండే ప్రదేశాలు, డ్రైనేజీలు గుర్తించి గ్రామ సర్పంచ్ శిరీష కొండారెడ్డి, జిల్లా మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసరాజు కలిసి పంచాయతీ సిబ్బందితో టెమిపాస్ స్పే చేయించటం, ఆయిల్బాల్సు వేయించారు.
టాయిలెట్ ఎయిర్ పైపులకు దోమలు వెళ్ళకుండా పలుచటి గుడ్డలను కట్టించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు హరిలీల, ఏఎన్యం స్వరూప, ఆశావర్కర్ జాన్బీ, గ్రామ పెద్దలు సారెడ్డి భాస్కర్రెడ్డి, నందిరెడ్డి సైదిరెడ్డి,ఇరిగల వెంకటరెడ్డి,రమేష్ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.