జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణ శివారులోని గంధంవారిగూడెంకు చెందిన డిఎస్పీ శంకర్ యాదవ్ గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందారు. అంబర్ పేట పోలీస్ శిక్షణా కేంద్రంలో డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన గుండెపోటు రావడంతో మృతి చెందగా ఆయన స్వస్థలమైన నల్లగొండ పట్టణ శివారు గంధంవారిగూడెం గ్రామానికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ రంగనాధ్, అదనపు ఎస్పీ నర్మద ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నల్లగొండకు తీసుకువచ్చిన ఆయన భౌతిక కాయం వద్ద నల్లగొండ డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీలు భాస్కర్, కృష్ణయ్య నివాళులు అర్పించారు.
ఇంకా జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, నాయకులు సోమయ్య, యాదగిరి, సిఐ రవీందర్, అంబర్ పేటకు చెందిన ఆర్.ఐ.లు అంకులయ్య, శ్రీకాంత్ జయరాజ్ తదితరులు కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు.