35.2 C
Hyderabad
April 20, 2024 15: 13 PM
Slider నల్గొండ

అనాధ వృద్ధుడిని ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్న డి.ఎస్.ఆర్.ట్రస్ట్

#oldage

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మేళ్ళచేరువు గ్రామంలో అనాధగా  మారిన వృద్ధుడిని డి ఎస్ ఆర్ ట్రస్టు ఆదుకున్నది. వృద్ధుడిని ఎవరు పటించుకోటం లేదని గుర్తించిన మాజీ ఎంపిపి ఇరిగేల లక్ష్మిరామ కృష్ణ రెడ్డి హుజూర్ నగర్ పట్టణంలోని డి.ఎస్.ఆర్.ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ట్రస్టు ఆ వృద్ధుడిని మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ఇందిరా అనాధ ఆశ్రమంలో చేర్పించారు.

ఈ సందర్భంగా దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ ఆశ్రమ నిర్వాహకులు నిర్మల ఆ వృద్ధుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని, ఎవరికైనా అనాథలు, ఎటువంటి నీడ లేకుండా వీధుల వెంట వుండే వారు కనపడితే వారికి ఆశ్రయం కల్పిస్తామని అన్నారు.

డి.ఎస్.ఆర్.ట్రస్ట్ ఆపదలో ఉన్న వారి కోసం ముందుండి మానవత్వం చాటుతుందని,అంకితం భావంతో మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఆర్.ట్రస్ట్ సభ్యులు బాపనపల్లి అంజి,కోలపూడి మహేష్,మణికంఠ,నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హీరో వేణు

Satyam NEWS

కరోనా నేపథ్యంలో పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలి

Satyam NEWS

విజయసాయిరెడ్డి పని అయిపోయినట్లుగానే కనిపిస్తున్నది

Satyam NEWS

Leave a Comment