డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు కుమారుడు దగ్గుపాటి సూర్యరాణ ఐదవ పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసిన అనంతరం హుజూర్ నగర్ లో సోమవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పది మొక్కలు నాటి 120 మొక్కలను 14 వ, వార్డులో పంపిణీ చేశారు. మొక్కలు చెట్లుగా మారి సమాజానికి ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడినట్లు పిల్లలు కూడా పెరిగి పెద్దవారై సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజ సేవ చేయాలని డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు అన్నారు.
14వ, వార్డులో వృద్ధ మహిళలకు 50 చీరల తో పాటు మాస్కులు కూడా పంపిణీ చేశారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ రవి, త్రివేణి చేతుల మీదుగా కరోనా రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో దగ్గుపాటి సుశీల, కవిత, దగ్గుపాటి సత్యానందం, చింతమల్ల ప్రసాద్, కోలపూడి కళ్యాణ్,మామిడి అశోక్, మామిడి రాజేష్, కోలపూడి ప్రేమ్ చందు, ములకలపల్లి రాంబాబు, మార్క్స్, దగ్గుపాటి రాజేష్, లక్కిమల్ల నాగేశ్వరరావు, శివనేని అబ్రహం, పాల్, శివ, రాజేష్, అంజయ్య, కోల్లపూడి సుందర్ రావు, కోలపూడి డేవిడ్, ఇసాక్, మెంటు చింటూ, దీక్షిత్,రమేష్ బాలు, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.