తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు “తెలంగాణ రైతు గోస బిజెపి పోరు దీక్ష” సందర్భంగా దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావ్ ఒక రోజు దీక్ష చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ల లోని ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యం కూడా కొనాలని ఆయన కోరారు.
తాలు ,తరుగు పేరుతో రైతులను వేధించవద్దని ఆయన తెలిపారు. రైతు బంధు వెంటనే ఇవ్వాలని, వెంటనే రుణ మాఫీ చేయాలని ఆయన కోరారు.
రైతు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.