32.7 C
Hyderabad
March 29, 2024 11: 58 AM
Slider మెదక్

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి: రఘునందన్

#MLARaghunandan

తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్  పిలుపు మేరకు “తెలంగాణ రైతు గోస బిజెపి పోరు దీక్ష” సందర్భంగా దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావ్ ఒక రోజు దీక్ష  చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ల లోని ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం కారణంగా తడిసిన, రంగు మారిన ధాన్యం కూడా ‌కొనాలని ఆయన కోరారు.

తాలు ,తరుగు పేరుతో రైతులను వేధించవద్దని ఆయన తెలిపారు. రైతు బంధు వెంటనే ఇవ్వాలని, వెంటనే రుణ మాఫీ చేయాలని ఆయన కోరారు.

రైతు సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Related posts

పంజాబ్‌ లో బీజేపీ, లోక్ కాంగ్రెస్ పోటీ

Sub Editor

మొక్కు తీర్చేందుకు పాదయాత్ర చేపట్టిన ప్రభుత్వ విప్

Satyam NEWS

ఉప్పల్  ప్రజలకు సేవకునిగా పనిచేస్తా: మందుముల పరమేశ్వర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment