27.7 C
Hyderabad
April 20, 2024 02: 50 AM
Slider మహబూబ్ నగర్

ఐక్య కార్యాచరణతోనే నూర్ భాషా/దూదేకుల గుర్తింపు

#Dudekula

తెలంగాణ ముస్లిం నూర్భాషా, దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం వనపర్తి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఖలీల్  అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా షేక్ సిద్ధాసాహెబ్ , విశిష్ట అతిధులుగా దూదేకుల సీనియర్ నాయకులు & రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ.సుబాన్ అలీ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్ ఆధ్వర్యంలో  నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ నాయకులను సన్మానించారు. వనపర్తి జిల్లా దూదేకుల సోదరులను వివిధ పదవులలో నియమించారు. ముఖ్య అతిధి షేక్ సిద్దాసాహెబ్ చేతుల మీదుగా సీనియర్ నాయకులు సుబాన్ అలీ  రాష్ట్ర నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

తదనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ-జాతి సమస్యల సాధనే ప్రధానంశంగా, రాష్ట్ర వ్యాప్తంగా దూదేకులకు విద్యాపరంగా, రాజకీయంగా,  సామాజికంగా గుర్తింపు కోసం రాష్ట్ర , జిల్లా కమిటీలు పని చేస్తున్నాయని, గత రెండు సం.లలో మన దూదేకుల సంఘీయులు రాజకీయంగా మరియు సామాజికంగా గుర్తింపు సాధించి, కోకాపేటలో దూదేకుల భవనం వంటి సానుకూల ఫలితాలు సాధించామని, ఇదే స్పూర్తితో, ఐక్య కార్యాచరణతో నూర్బాష్ / దూదేకుల సమస్యలు సాధించుకుందామని పిలుపునిచ్చారు. నిరంతరం మన  సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సంఘ సేవా కార్యక్రమాలతో దూదేకుల ఉన్నతికి పాటుపడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు- అబ్దుల్ బషీర్, రాష్ట్ర పొలిటికల్ కోఆర్డినేటర్-జహంగీర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు-ఎండీ. ఖాసిం, మైనారిటీ నాయకులు-జహంగీర్, రాష్ట్ర కార్యదర్శులు ఎండీ. ఖాజా,  ఇదయితుల్లా, రజాక్, జమాల్, రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడు ఎండీ. ఖాజా మోయినుద్దీన్, రాష్ట్ర నాయకులు ఉస్మాన్, మహమూద్ పాషా, గద్వాల్ జిల్లా అధ్యక్షుడు- సుబాన్, యండి. ఉస్మాన్, మౌలాలీ, షేక్ షావలి, షాలిమియ, హుసేన్, అహ్మద్ హుస్సేన్, బాషా, రుఖ్మద్దీన్, మస్తాన్, చాంద్ పాష,లాల్ మహ్మద్, బాలెమియ, నవాబ్, సల్మాన్, అల్లీపీర్,ఆరిఫ్, షాబుద్దీన్, నౌషాద్, బాలెమియ, జిల్లా ఉపాధ్యక్షుడు-మాబాష తదితరులున్నారు.

తదనంతరం వనపర్తి జిల్లా, రాష్ట్ర సమస్యలను స్థానిక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి  వినతిపత్రం అందజేశారు. ఈ మద్యనే అగ్ని ప్రమాదంలో పరుపుల ప్యాక్టరీ  కాలిపోయిన బాధిత యజమాని మంత్రిని  కలిశారు. ప్రభుత్వ సహాయం కోరగా, మంత్రి  వారికి అండగా ఉంటామని తెలిపారు.

 నూతన నియామక సభ్యులకు జాతీయ అధ్యక్షుడు అనీస్ మన్సూరీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్, జాతీయ ఇంచార్జి షేక్ షకీనా, జాతీయ ఉపాధ్యక్షుడు షకీల్ మన్సూరీ, రాష్ట్ర వనపర్తి జిల్లా నాయకులు అభినందనలు తెలిపారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

బాబు విడుదలతో మిన్నంటిన సంబరాలు

Satyam NEWS

సుఖ భోగాలకు మార్గం సౌభాగ్యాలకు ద్వారం

Satyam NEWS

కరోనా నేపథ్యంలో పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలి

Satyam NEWS

Leave a Comment