రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
కనకదుర్గమ్మ ఆలయంలోని అమ్మవారి వెండి రథాన్ని దేవదాయ శాఖ కమిషనర్ పి.అర్జనరావుతో కలిసి మంత్రి బుధవారం పరిశీలించారు.
అమ్మవారి వెండిరధంపై మూడు సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించడంలేదన్నారు.
గత ప్రభుత్వం హయాంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుందన్నారు. ఘటనపై దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తాం అని, కమిటీ విచారణ చేసి నిజాలు నిగ్గు తెలుస్తారన్నారు.
చాలా ఆలయాల్లో భద్రతను ప్రైవేట్ ఏజెన్సీలు చూస్తున్నాయని మంత్రి తెలిపారు. సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతా లోపం అని తేలితే దానిపై చర్యలు తీసుకుంటాం అన్నారు.
ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయి. అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నాం అని సృష్టం చేశారు.