విశాఖపట్నం లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కడప జిల్లా పుల్లంపేటకు చెందిన చింతగింజల ద్వారకాగోపినాధ్ ను సెలక్షన్ కమిటీ సభ్యునిగా రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకటరావు ఎంపికచేశారు.
ద్వారాక గోపి నాధ్ జిల్లా బాల్ బాడ్మింటిన్ క్రీడాకారునిగా అనంతరం రాష్ట్ర రిఫరీ గా 18 సంవత్సరాలు, అప్పటి కార్యదర్శి అంబాల చంద్ర శేఖర్ రెడ్డి హయాంలో డిప్యూటీ చీఫ్ రెఫరీగా 2 పర్యాయాలు,రెఫరీస్ బోర్డు మెంబర్ గా పని చేశారు.
అంతేకాకుండా అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలల్లో న్యాయ నిర్ణేతగా ఎస్ వి యూనివర్సిటీ, కుప్పం ద్రావిడన్ యూనివర్సిటీ, గుంటూరు యూనివర్సిటీ, లలో పలు పోటీలకు రెఫరీగా పని చేశారు.
అలాగే కడప జిల్లా బాల్ బాడ్మింటిన్ అస్సోసియేషన్ కార్యదర్శిగా, సహాయ కార్యదర్శిగా, కోశాధికారిగా పనిచేసారూ. ఆయన సేవలను రాష్ట్ర కార్యవర్గం గుర్తించింది.ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యక్షులు వై కృష్ణమూర్తి, మధు, జిల్లా కార్యదర్శి సుధాకర్, నందకిశోర్, శంకరరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.