ఏలూరు నగరంలో అభివృద్ధి లక్ష్యంగా మూడు వందల కోట్ల రూపాయలతో డ్రైన్ లు రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు ప్రాంతాలలో ప్రసంగించారు.
ఏలూరు కార్పొరేషన్ లో మంత్రి ఆళ్ల నానికి అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. మంత్రి ఆళ్ల నాని కి పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
వెంకట పురం పంచాయతీ పరిధిలో సుంకర వారి తోట లో మంత్రి ఆళ్ల నాని కి మహిళలు అపూర్వ స్వాగతం పలికారు.
పేద వాడి సొంతంటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
వెంకట పురం ప్రాంత ప్రజలకు త్రాగు నీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి గోదావరి నీటిని అందిస్తామని ఆయన తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగవ రోజు ఏలూరులో 6,9,19,14 డివిజన్లలో మంత్రి ఆళ్ల నాని ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఏలూరు నియోజకవర్గం అంటేనే ఉన్నత ప్రమాణాలతో కూడిన, విద్య, వైద్యం, అభివృద్ధి సంక్షేమం అనే గుర్తింపు వచ్చేలా ఆదర్శవంతంగా అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
అమ్మ ఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా కానుక, వైయస్సార్ చేయూత, ఆసరా, ఆరోగ్యశ్రీ లతోపాటు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన తెలిపారు.