కడప నగరంలోని లోతట్టు ప్రాంతాలలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష నేడు పర్యటించారు. గౌస్ నగర్, గంజికుంట కాలనీ లో పర్యటించి లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రజలకు భరోసా కల్పించారు.
కాలువల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని కార్పొరేషన్ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన చేశారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ లవన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.