విజయనగరం జిల్లా లో గత రాత్రి ప్రేమించిన యువతిపై ప్రేమోన్మాది పెట్రోల్ పోసిన ఘటన జిల్లా తో రాష్ట్రాన్ని తాకింది. జిల్లా పర్యటన కు వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ విషయం తెలుసుకున్న వెంటనే బాధితురాలు జిల్లా కేంద్ర హాస్పిటల్ లో చికిత్స పొందుతోందన్న సమాచారం తెలిసిన మరుక్షణం హాస్పిటల్ కు వెళ్లారు. ఇక జిల్లా కు చెందిన జిల్లాలో ఉన్న డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కూడా హాటాహుటిన కేంద్ర వైద్య శాలకు వచ్చి బాధితురాలిని పరామర్శించారు. దరిమిలా జిల్లా కేంద్ర వైద్య శాల మరోమారు మంత్రుల రాకతో హాడావుడిగా కనిపించింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం వచ్చారన్న విషయం తెలుసుకున్న హాస్పిటల్ డాక్టర్ల తక్షణం తమ తమ విధులలో అలెర్ట్ అయ్యారు ఏతావాత ఓ డిప్యూటీ సీఎం, ఓ మంత్రి ,ఇద్దరు ఎమ్మెల్య రాకతో మరో సారి జిల్లా కేంద్ర వైద్యశాల మీడియా పరంగా వార్తలకెక్కింది.
previous post