జులై 4 నుంచి ఈఏపీ సెట్ పరీక్షల షెడ్యూల్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ‘‘ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ (ఈఏపి) సెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఏప్రిల్ 11న నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఇతర పోటీ పరీక్షల తేదీలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ప్రకటిస్తాం. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు ఉంటాయి.
ఈఏపీ సెట్ పరీక్షల ఫలితాలు ఆగస్టు 15 తర్వాత విడుదల చేసే యోచనలో ఉన్నాం. పరీక్షా విధానం, ర్యాంకుల ప్రకటనలో మార్పుల్లేవు. ఆగస్టు 15లోగానే ఇంటర్ ఫలితాలను కూడా వెల్లడిస్తాం’’ అని సురేశ్ పేర్కొన్నారు.