మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో ముందు స్తు ఎన్నికలు రాబోతున్నాయని…విషక్ష టీడీపీ జోస్యం చెప్పింది. నిన్న కాక మొన్ననే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు… ఈ నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయని చెప్పిన మరుసటి రోజు ను విజయనగరం జిల్లా టీడీపీ నోట వెంట ఈ వ్యాఖ్య రావడం విశేషం. జగన్ ప్రభుత్వ హయాంలో… వరుసగా కరెంట్ కోతలు గురవుతున్ళ నేపథ్యంలో విజయనగరం టీడీపీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్… తదితరులు నగరంలో ని కనపాక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద…ఆందోళన కు దిగారు. ఈ సందర్భంగా పార్టీ నగర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ… రాష్ట్రంలో 57వేల కోట్ల అప్పు చేసిన ఈ జగన్ ప్రభుత్వం… విద్యుత్ ను మాత్రం దగా చేసిందన్నారు. రోజు లో కనీసం రెండు న్నర గంటల కోత విధించి…ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇక 2024 లో రావలసిన అసెంబ్లీ ఎన్నికలు…ఈ ఏడాది చివర్లో రానున్నాయని…టీడీపీ అధినేత చంద్రబాబు ను గెలిపించి…రాష్ట్ర కష్టాలకు చరమగీతం పాడుదామని అన్నారు.
previous post