టర్కీ, సిరియాలో భూకంపం మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు 4,500కు పైగా మరణించినట్లు సమాచారం అందుతున్నది. ఒక్క టర్కీలోనే 3వేలకు పైగా చనిపోగా సిరియాలో సుమారు 1500 మంది మృత్యువాత పడ్డారు. టర్కీలో సుమారు 15వేలు, సిరియాలో దాదాపు 4వేల మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స
పొందుతున్నారు. మరోవైపు ఈ భూకంపంలో మృతుల సంఖ్య మరింత భారీగా పెరగొచ్చని డబ్ల్యూహెచ్వో తెలిపింది. 20వేల మందికి పైగా మరణించి ఉంటారని అంచనా వేసింది. దాదాపు 50 శక్తిమంతమైన ప్రకంపనలు రెండు దేశాలనూ వణికించాయి. ఆ ప్రకంపనల్లో ఒకదాని తీవ్రత రెక్టర్ స్కేల్ పై ఏకంగా 7.5గా నమోదైంది.