తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ చురుకుగా సాగుతున్నది. కాకినాడ రూరల్ మండలంలోని కొవ్వూరు గ్రామాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్ పి అద్నాన్ నయీమ్ సమీ సందర్శించారు.
అక్కడి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కాకినాడ ఎస్ డి పి ఓ అయిన వి భీమారావుకు తగిన ఆదేశాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా అక్కడి పోలింగ్ సిబ్బందికి ఆయన ఓఆర్ఎస్ పాకెట్లను అందచేశారు.
అదే సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులకు కూడా ఆయన ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేశారు.