శ్రీకాకుళం జిల్లా స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద ఉన్నఇమ్మానియేల్ చర్చ్ లో ఘనంగా ఈస్టర్ పండగ జరిగింది.
ఈ సందర్భంగా ఇమ్మానియేల్ చర్చ్ పాస్టర్ . రెవ.డా.కె. జయరాజు ప్రభు యేసు గుడ్ ఫ్రైడే నాడు సిలువ వేయబడి మరల మూడు దినమున తిరిగి లేచిన సందర్భంగా దేశమంతట ఈస్టర్ పండగ ఘనంగా జరుపుకుంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
క్రీస్తు అయిన ప్రభు యేసు మూడోదినాన లేచినపుడు పునర్దర్శనం చేసుకోవటంతో భక్తులందరూ దేశమంతటా ఘనంగా పండుగ జరుపుకుంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
అదేవిధంగా ఇమ్మానియేల్ చర్చ్ లో ఈస్టర్ పండగ ప్రత్యేక కార్యక్రమాలు, పాటలు తో కోలాహలం మధ్య పాస్టర్.రెవ.డా.కె. జయ రాజు కుమారులు కె. బెన్ని ఆధ్వర్యంలో సంఘ పెద్దలు మధ్య ఘనంగా జరిగాయి.