విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటు పై తూర్పు నావికాదళం అభ్యంతరం తెలిపిందని వస్తున్న వార్తలను తూర్పు నావికాదళం ఖండించింది. తాము ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని వెల్లడించింది. ఈ మేరకు తూర్పు నావికాదళ కమాండ్ పిఆర్ఓ కెప్టెన్ సిజి రాజు మీడియాకు ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. మిలీనియం భవనంలో సెక్రటేరియేట్ పెడుతున్న ప్రతిపాదన కానీ దాన్ని తాము వద్దన్న అంశం కానీ లేదని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని ఆయన వెల్లడించారు.
previous post