మట్టి గణపయ్య విగ్రహాలనే శ్రేయస్కరమని అందరూ చెబుతున్న వేళ.. విజయనగరం జిల్లాలోని నెహ్రూ యువక కేంద్ర,శ్రీ పైడిమాంబ యూత్ క్లబ్,ఎస్.పీ యూత్ క్లబ్, స్పార్క్ సొసైటీ సంయుక్తంగా జిల్లా కేంద్రమైన కలెక్టరేట్ జంక్షన్ వద్ద మట్టి విగ్రహాలను పంపిణీ చేసారు.
ఈ మేరకు నెహ్రూ యువక కేంద్రం కో ఆర్డినేటర్ విక్రమ్ ఆదిత్య,స్పార్క్ సొసైటీ పౌండర్ పద్మనాభం ఈ మట్టి గణపయ్య విగ్రహాలను పంపిణీ చేసారు. లెప్రిసి కాలనీ లో పేదలకు, కుస్టు రోగులకు బట్టల పంపిణీ చేశారు.
అలాగే ఎస్.పీ యూత్ క్లబ్ అధ్వర్యంలో పర్యావరణం, పేదలకు వస్త్రాలు,ఆహారం, స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాము అని క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుడ్ల గిరీష్ కుమార్, కార్యదర్శి చుక్కా సాయినాథ్ రెడ్డి మరియు క్లబ్ సభ్యులు అరుణ్ కుమార్, హేమంత్ కుమార్, అశోక్, జోయెల్ పాల్గొన్నారు.