హైదరాబాద్లో ముసద్దీలాల్ జ్యువెలర్స్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 24 గంటలుగా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. గతంలో సంస్థకు చెందిన రూ.130 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసింది. నోట్ల రద్దు సమయంలో బ్లాక్ మనీని మార్చుకునేందుకు భారీగా విక్రయాలు జరిపిన కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంకు రుణాల ఎగవేతపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. షో రూమ్లోని స్టాక్, సేల్స్ రికార్డులపై ఈడీ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. దుకాణం లోని వుద్యోగులతో పాటు రికార్డులను పరిశీలిస్తున్నారు.
previous post