సామాజిక అసమానతలను, దురాచారాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గం అని నమ్మిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని భాజపా రాష్ట్ర ఓ బి సి ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ అన్నారు.
ఆదివారం జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా సైనిక్ పూరిలోని పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి లోని పలు ప్రాంతాలలో పేద ప్రజలకు దుప్పట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు గోపాల కృష్ణ యాదవ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఓబిసి అధ్యక్షులు మంగేష్ కుమార్, మల్కాజిగిరి ఓబిసి కన్వీనర్ విఠోబా బిసి సంఘం నాయకులు, భాజపా నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి