అప్స ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 9 10 వ తరగతి చదివే ఆడపిల్లలకు ఎడ్యుకేషన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసి వార్డ్ కమిటీ సభ్యులు అచ్చినీ రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ప్రస్తుతం ఉన్న కోవిద్ 19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ క్లాసులు చదువుతున్న పిల్లలకు కావలసిన కిట్ అందచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కిట్ లో క్వశ్చన్ బ్యాంకు పుస్తకాలు, శానిటైజర్, మాస్కులు, సానిటరీ నాప్కిన్స్ తదితర వస్తువులు ఉంటాయి. ఈ కార్యక్రమంలో అప్స ప్రతినిధులు సుమతి దేవి లక్ష్మి రేణుక తదితరులు పాల్గొన్నారు.