28.2 C
Hyderabad
April 20, 2024 13: 57 PM
Slider ముఖ్యంశాలు

విద్యాశాఖ మంత్రి బొత్స విజయనగరం జిల్లాకు రాక‌

#BotsaSatyanarayana

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స 22వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నే ఇదే రోజు అమరావతి నుంచీ తన స్వంత జిల్లా కు బయలుదేరనున్నారు.

ఈ మేరకురాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ గురువారం జిల్లాలో మరో మంత్రి ఆదిమూలపు సురేష్ తో ప‌ర్య‌టించ‌నున్నారు.

మంత్రి విశాఖ నుంచి బ‌య‌లుదేరి 23 ఉద‌యం 7 గంట‌ల‌కు విజయన‌గ‌రం చేరుకుంటారు. ఉద‌యం 9.30 గంట‌ల‌కు న‌గ‌రంలో మంచినీటి స‌ర‌ఫ‌రా కోసం ఆర్టీసీ కాంప్లెక్సు స‌మీపంలో అమృత్ ప‌థ‌కం కింద 196 ల‌క్ష‌ల‌తో నిర్మించిన 1500 కిలోలీట‌ర్ల సామ‌ర్ధ్యంగ‌ల తాగునీటి ట్యాంకును ప్రారంభిస్తారు.

అనంత‌రం శ్రీ‌కాకుళం జిల్లా ఎచ్చెర్ల‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.అక్కడ నుంచీ విజయనగరం జిల్లాకు చేరుకుంటారు.

కాస్త విశ్రాంతి తీసుకుని..సాయంత్రం 4-00 గంట‌ల‌కు నెల్లిమ‌ర్ల స‌మీపంలోని సారిప‌ల్లి వద్ద ప‌ట్ట‌ణ నిరుపేద‌ల కోసం నిర్మించిన ఇళ్ల‌ను రాష్ట్ర పుర‌పాల‌క ,ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌తో క‌ల‌సి ప్రారంభిస్తారు.

సాయంత్రం 7 గంట‌ల‌కు విశాఖ బ‌య‌లుదేరి వెళ‌తారు. అక్కడ నుంచీ విజ‌య‌వాడ బ‌య‌లుదేరి వెళ‌తారు.

Related posts

ట్రాజెడీ: గల్ఫ్ లొ సిద్దాపూర్ వాసి మృతి

Satyam NEWS

వనపర్తిలో పత్రికల ప్రభావం పని చేయదు

Satyam NEWS

ఆనందయ్య మందు: జగన్ ప్రభుత్వంపై ఏపి హైకోర్టు ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment