40.2 C
Hyderabad
April 24, 2024 17: 31 PM
Slider నిజామాబాద్

ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దహనం

burning of MLC Kavitha

నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపైన టిఆర్ఎస్ గుండాలు దాడి చేయడం సిగ్గుచేటు అని బీజేపీ నాయకులు విమర్శించారు. ప్రశ్నించే గొంతును నొక్కుతున్నారని, ప్రశ్నిస్తే రౌడీయిజం దాడులు చేస్తున్నారని, టిఆర్ఎస్ గూండాలు బిజెపి కార్యకర్తలు దాడికి ప్రతిదాడి చేస్తే తట్టుకునే దమ్ముందా అని వారు ప్రశ్నించారు. లిక్కర్ స్కాం దొంగ కవిత నిజామాబాద్ ఎంపీ ఇంట్లో లేరని తెలిసి 70 సంవత్సరాల వాళ్ళ అమ్మా ఇంట్లో ఉంటుందని తెలిసి టీఆర్ఎస్ గుండాలు ఇంట్లోకి చొరబడి హిందూ దేవుళ్లను పగలగొట్టి, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేశారని వారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అని వారన్నారు.

ఈ సందర్భంగా కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ బిజెపి ఇన్చార్జి మల్లాద్రి రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు గుడుగుట్ల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు రాజాసింగ్, జుక్కల్ నియోజకవర్గం నుండి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తేపవర్ తుకారం, బిచ్కుంద బీజేవైఎం మండల అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు, బిజెపి మద్నూర్ మండల అధ్యక్షుడు అనుమండ్లు, బీజేవైఎం జుక్కల్ కాంసెన్సీ కన్వీనర్ మాటూరు నవీన్ రెడ్డి, పిట్లం మండల అధ్యక్షుడు రాజు, కొడపగల్ మండల అధ్యక్షులు సుభాష్ ,నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

జి లాలయ్య సత్యం న్యూస్ రిపోర్టర్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

అన్యమత సిబ్బందికి ఉద్వాసన తప్పదు

Satyam NEWS

దొంగతనానికి పాల్పడిన ఎస్ ఐ పై పోలీసు కేసు నమోదు

Satyam NEWS

బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా

Satyam NEWS

Leave a Comment