31.2 C
Hyderabad
April 19, 2024 04: 01 AM
Slider జాతీయం

ఒడిషాలో సీఎం కాన్వాయ్‌పై బిజేవైఎం కోడిగుడ్ల దాడి

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ కాన్వాయ్​ పై గుడ్ల దాడి జరిగింది. పూరీలో రూ.331 కోట్ల శ్రీ జగన్నాథ్‌ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్ కాన్వాయ్‌పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు.

 పూరీ నుంచి​భువనేశ్వర్‌కు తిరిగి వెళ్తుండగా దర్జీపోఖారీ ఛక్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. కలహండి ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలిని కిడ్నాప్​చేసిన దుండగులు ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశారు.

ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూరీలో నిరసన చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలు.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని వెళ్లి అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. కాగా సీఎం కారుపై దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

Related posts

రాజధానిపై టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.277 కోట్లు

Satyam NEWS

కరోనా మందుల బ్లాక్ మార్కెటీర్ల రాకెట్ అరెస్టు

Satyam NEWS

లక్ష్యం 100 శాతం పూర్తి కావాలి

Murali Krishna

Leave a Comment