ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై గుడ్ల దాడి జరిగింది. పూరీలో రూ.331 కోట్ల శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన పట్నాయక్ కాన్వాయ్పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు.
పూరీ నుంచిభువనేశ్వర్కు తిరిగి వెళ్తుండగా దర్జీపోఖారీ ఛక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. కలహండి ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలిని కిడ్నాప్చేసిన దుండగులు ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశారు.
ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూరీలో నిరసన చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలు.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని వెళ్లి అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. కాగా సీఎం కారుపై దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.