27.2 C
Hyderabad
September 21, 2023 22: 10 PM
Slider ఆంధ్రప్రదేశ్

చింతూరు రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

acce34

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు మధ్య ఒక టెంపోట్రావెలర్ ప్రమాదానికి గురైంది. ఘాట్‌రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద  అదుపుతప్పి లోయలో పడటంతో 8 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వీరు మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులంతా కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం నుంచి వచ్చారు. భద్రాచలం దర్శనం అనంతరం అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో టెంపోట్రావెలర్ లో 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మారేడుమిల్లి-చింతూరు రహదారి లోయలు, గుట్టలతో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఈ రహదారిలో చాలా నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఎక్కువగా వాహనాలు నడుపుతుంటారని.. కొత్తగా వచ్చేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

Related posts

అవినీతిపరుల ‘సత్య ప్రమాణం’ రాజకీయాలు

Satyam NEWS

ఘనంగా మణిపూర్ మహరాణీ గైడిన్లుయా 108వ జయంతి

Bhavani

కొనసాగుతున్న యాదాద్రి ముఖ్య అర్చకుడి అన్నవితరణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!