అనారోగ్యం తట్టుకోలేక ఒక వృద్ధురాలు కాలవలో దూకి మరణించింది. వరంగల్ జిల్లా అయినవోలు మండలం ఒంటి మామిడి గ్రామానికి చెందిన మెరుగు లక్ష్మి (80) మృతదేహాన్ని నర్సింగాపూర్ కెనాల్ లో కనుగొనడంతో ఈ విషయం వెల్లడి అయింది.
హుజురాబాద్ పట్టణం లోని విద్యానగర్ కాలనీ కి చెందిన ముక్కెర కుమారస్వామి అత్తగారు మెరుగు లక్ష్మి. ఆమె గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో విరక్తి చెంది ఉన్నారు. ఆరోగ్యం కుదటపడే అవకాశం లేదని భావించిన ఆమె కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం బోర్నపల్లి కెనాల్ పై నుండి దూకినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ మృతదేహం గల్లంతు అయి నర్సింగాపూర్ కెనాల్ లో దొరికింది.