సురభి వాణి దేవి పీవీ కుమార్తె కాకుండా విద్యావేత్త. సేవా భావం కలిగిన వ్యక్తి. అందుకే ఈ ఏకైక మహిళా అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు.
హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ నియోజకవర్గ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీ దేవి గెలుపు కోరుతూ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇందుకోసం ఇబ్రహీంపట్నం బొంగుళూరులో ఓ ఫంక్షన్ హాలులో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.
బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు లేని నెట్ వర్క్ టీఆర్ఎస్ కు ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటరును నేరుగా కలిసి తెరాసకు ఎందుకు ఓటు వేయాలో వివరించాలని ఆయన కోరారు.