33.2 C
Hyderabad
April 26, 2024 01: 09 AM
Slider కడప

వైసీపీతో ఎన్నికల అధికారుల కుమ్మక్కు పై భత్యాల ఆగ్రహం

batyala 13

కడప జిల్లా కోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో ఎలాంటి కారణాలు లేకపోయినా అధికారులు తెలుగుదేశం పార్టీ వారి నామినేషన్లను తిరస్కరించారని రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్   బత్యాల చంగల్ రాయుడు అన్నారు. ఈ రెండు నియోజకవర్గాలలో ఎలక్షన్ అధికారులు వైసీపీ ఎలా చెబితే అలా చేశారని ఆయన అన్నారు.

ఏ రోజు నామినేషన్ ఫారాలను పరిశీలిస్తారో అదేరోజు వాటిని నోటీస్ బోర్డులో డిస్ ప్లే చేయాల్సి ఉండగా మరునాడు చేశారని ఇదేం పద్ధతని ఆయన ప్రశ్నించారు. ఏ కారణంతో రిజెక్ట్ చేసారన్నది ఇంత వరకు తెలపలేదని, అలాగే ప్రతిపాదించిన వారిని కూడా అనుమతించాల్సి ఉన్నా కేవలం అభ్యర్ధులను మాత్రమే లోపలకు పంపారని ఆయన అన్నారు.

అయితే వైసీపీ వారిని మాత్రం సంబంధం లేని వారిని కూడా లోనికి అనుమతించారని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయాలన్నీ పరిశీలించి చర్యలు తీసుకోవాలని బత్యాల చంగల్ రాయుడు కోరారు. తిరస్కరించిన టీడీపీ అభ్యర్థులు నామినేషన్లను మళ్లీ పరిశీలించాలని బత్యాల ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి ని కోరారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు మాజీ జడ్పీటీసీ బత్యాల నాగరాజ ప్రసాద్, కస్తూరి సుధాకర్, శ్రీకారపు శివయ్య, అఖిల భారత యాదవ్ మహాసభ ప్రధాన కార్యదర్శి భారతాల శ్రీధర్ బాబు యాదవ్, టి.యన్.యస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రేవురి వేణుగోపాల్, కొండా శ్రీనివాసులు, యనాది, టి.యన్.యస్.ఎఫ్ జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్, నర్సయ్య, కేత నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలిసి చేశారా? తెలియక చేశారా? అనువుకాని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం

Satyam NEWS

మీరెవరూ మా వూరికి రావద్దు మేము కూడా రాము

Satyam NEWS

టీమిండియా ఘన విజయం.. 66 పరుగుల తేడాతో విన్

Sub Editor

Leave a Comment