సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు లో కాంట్రాక్టు లైన్ మెన్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి కరెంటు షాక్ తో మరణించాడు. మేళ్ల చెరులోని ట్రాన్స్ ఫార్మర్ పని చేయకపోవడంతో గ్రామస్థుల ఫిర్యాదు మేరకు అజ్మీరా సైదా (26) రిపేర్ చేసేందుకు పైకి ఎక్కాడు. అయితే అతను రిపేర్ చేస్తుండగా కరెంటు సరఫరా జరగడంతో అక్కడికక్కడే మరణించాడు.
సైదా గత 8 ఏళ్లుగా మేళ్లచెరువులో లైన్ మెన్ గా పని చేస్తున్నాడు. సైదా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తాండాకు చెందిన అవివాహితుడు. అతడి తల్లి అజ్మీరా బాలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.