చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో దారుణం. వేరుశనగపంటకు కాపలాగా ఉన్న తండ్రీ కూతురిపై ఏనుగు దాడి చేసింది. కుమార్తె సోనియా అక్కడికక్కడే మృతి చెందింది.
అదృష్టవశాత్తూ తండ్రి మురుగన్ తృటి లో తప్పించుకున్నాడు. సోనియా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ఏనుగు దాడి సమాచారం అందుకున్న చిత్తూరు డి.యఫ్.ఓ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు.