పదవీ కాలంలో ప్రజలకు మంచి సేవలు అందించి వారి మన్ననలు పొందిన ఉద్యోగి ఉత్తముడని జూనియర్ సివిల్ జడ్జి యన్.మంజుల అన్నారు. గురువారం హుజూర్ నగర్ కేంద్రంలోని జూనియర్, సీనియర్ కోర్టులో పదవీ విరమణ పొందుతున్న జూనియర్ అసిస్టెంట్ తేజావత్ బాలాజీ దాస్ సన్మాన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
బాలాజీ 31 సంవత్సరాలపాటు న్యాయ శాఖలో కోదాడ, హుజూర్ నగర్, నకిరేకల్, సూర్యాపేట తదితర కోర్టుల్లో వివిధ హోదాలలో పనిచేసి ప్రజా మన్ననలను పొందారాన్నారు. బాలాజీ అత్యంత నిజాయితీగా, నిస్వార్ధంగా, పనిచేసి అజాత శత్రువుగా నిలవటం అభినందనీయం అని కొనియాడారు.
కొత్తగా ఉద్యోగంలో చేరే యువ ఉద్యోగులు బాలాజీని ఆదర్శంగా తీసుకోవాలని ఆమె కోరారు. అనంతరం బాలాజీని శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జూనియర్, సీనియర్ సివిల్ కోర్టుల సూపరింటెండెంట్ శరత్, గంగాశంకర్, గోవర్ధన్, సోహైల్, బ్రహ్మారెడ్డి, నందా, రాము, రోజా, మౌనిక, శ్యామ్ కుమార్, బార్ అసోసియేషన్ అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.