33.2 C
Hyderabad
April 25, 2024 23: 23 PM
Slider మహబూబ్ నగర్

ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ: మీరు బాగుంటేనే నేను బాగుంటా

jayapal yadav

ప్రజలంతా బాగుంటేనే తాను బాగుంటానని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క  జైపాల్ యాదవ్ తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి మండల పరిధిలోని మార్చాలా, జీడిపల్లి గ్రామాలలో ఈజీఎస్ పనులను సోమవారం ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈజీఎస్ కూలీలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు చేయాలని, ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని సూచించారు. కూలీలకు కూలీ డబ్బులు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్ గౌడ్,ఎంపీపీ సునీతా కుర్మయ్య, కౌన్సిలర్ సూర్య ప్రకాష్ రావు, ఎంపీడీవో బాలచంద్ర సుజన్, ఏపీడి గోవిందరాజులు, సర్పంచులు ఆవ మల్లయ్య, కల్పనా కృష్ణయ్య, ఎంపీటీసీలు శంకర్, సంతోష మల్లేష్, నాయకులు మనోహర్ రెడ్డి, బి.శ్రీధర్, పలువురు నాయకులు, తదితరులు ఉన్నారు  

Related posts

బ‌ల్దియా రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు వైద్య బీమా సౌక‌ర్యం

Satyam NEWS

హెల్పింగ్ హ్యాండ్: కొనసాగుతున్న సహాయక చర్యలు

Satyam NEWS

కాళేశ్వరంతో కళకళలాడుతున్న తెలంగాణ

Bhavani

Leave a Comment