32.7 C
Hyderabad
March 29, 2024 10: 28 AM
Slider మహబూబ్ నగర్

పి ఎం ఇ జి పి పై నాగర్ కర్నూల్ లో అవగాహన సదస్సు

#nagarkurnoolcollector

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పై అవగాహన నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి సమావేశ మందిరంలో తేదీ 24 9 2021 ఉదయం 11:30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1:30 వరకు గది సంఖ్య 104 లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై అవగాహన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ డీపీఆర్ఓ హాజరవుతున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారుపథకం యొక్క విధి విధానాలు దరఖాస్తు విధానం కావలసిన దస్త్రాలు విలువైన అంశాల పైన అవగాహన కల్పిస్తున్నట్లు అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు స్వయం సహాయక బృందాలు సొసైటీ చట్టం 1860 కింద నమోదైన సంస్థలు ఉత్పత్తి సహకార సంఘాలు ట్రస్టులు ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులని సూచించారు.

తయారీ రంగ పరిశ్రమలకు గరిష్టంగా ప్రాజెక్టు వ్యయ పరిమితి 25 లక్షల వరకని సేవారంగ పరిశ్రమలకు10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఈ పథకంలో 25 శాతం నుండి 35 శాతం వరకు సబ్సిడీని పొందవచ్చునన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు స్వయం సహాయ బృందాలు పాల్గొనాలని ఆయన కోరారు.

Related posts

నవంబర్ నెలాఖరు లోగా పోడు భూముల సర్వే పూర్తి

Murali Krishna

లాఠీ పట్టాల్సిన ఖాకీల చేతులు.. మానవత్వాన్ని పట్టుకున్నాయి..!

Satyam NEWS

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment