బిచ్కుంద మండలంలోని సెట్లురు హస్గుల్ గోపన్పల్లి గ్రామాల్లో ఉపాధి హమీ ప్రత్యేక అధికారి జడ్పీ సీఈవో చందర్నాయక్ పర్యటించారు. సెట్లురు లో నర్సరీ ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం హజ్ గుల్ లో నర్సరీ అవెన్యూ ప్లాంటేషన్ ను ఆయన పరిశీలించారు.
అనంతరం గోపన్పల్లి గ్రామంలో కంపోస్టు సెడ్ డంపింగ్ యార్డు వైకుంట ధామ పనులను పరిశీలించారు. గోపన్పల్లి పల్లె ప్రగతిలో నిర్మితమైన పనులను పూర్తి చేసినందుకు సర్పంచ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారితోపాటు ఎంపిడివో ఆనంద్ ఎంపీ ఓ మహబూబ్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.