మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఇవాళ ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు.
అటు పోలీసులు అదనపు బలగాలను రప్పించి మరీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తప్పించుకున్న వారి కోసం గాలింపు జరుగుతోందని.. నక్సల్స్ను మొత్తం ఏరివేసేవరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మృతి చెందగా.. మరికొంత మంది మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు.