28.7 C
Hyderabad
April 20, 2024 05: 53 AM
Slider జాతీయం

మహరాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోలు మృతి

#encounter at Maharastra

మహరాష్ట్రలోని గడ్చిరోలి  జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య  ఇవాళ ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు  మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు.

అటు పోలీసులు అదనపు బలగాలను రప్పించి  మరీ  కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. తప్పించుకున్న వారి కోసం గాలింపు జరుగుతోందని.. నక్సల్స్‌ను మొత్తం ఏరివేసేవరకు ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మృతి చెందగా.. మరికొంత మంది మావోయిస్టులకు తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు వెల్లడించారు.

Related posts

భారీ వాహనాలు సిటీలోకి రానివ్వం..అంటున్న ట్రాఫిక్ సిబ్బంది…!

Satyam NEWS

శుభకృత్’ కు స్వాగతం

Satyam NEWS

తెలంగాణ లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment