చైత్ర అనే ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన రాజును వెంటనే ఎన్ కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలి అని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేసారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి కేటీఆర్ లు ఎందుకు ఇప్పటి వరకూ చైత్ర కుటుంబాన్ని పరామర్శించే లేదు అని ఆయన ప్రశ్నించారు. ఈ సంఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నా నిందితుడిని ఎందుకు పట్టుకోవడం లేదు అని ఆయన ప్రశ్నించారు ఇందులో ఆంతర్యమేమిటి?
మహిళా మంత్రులు ఎందుకు చైత్ర కుటుంబాన్ని పరామర్శించే లేదు? అగ్రకులాలకు ఒక న్యాయం గిరిజన బిడ్డలకు ఒక న్యాయమా ప్రియాంక రెడ్డి పై అత్యాచారం చేసి చంపితే వెంటనే ఎన్కౌంటర్ చేశారు కానీ చైత్ర పై అత్యాచారం చేసి హత్య చేస్తే ఎందుకు ఎన్ కౌంటర్ చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్న నాయకులు యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి యాస బోయిన సాంబయ్య సామాజిక తెలంగాణ జిల్లా అధ్యక్షులు కోరే రవి యాదవ్ మాల మహానాడు సంఘం జిల్లా కార్యదర్శి బందెల రవి కుమార్ శ్రీను సాంబయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.