రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు ప్రధాన కేంద్రంగా ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో మరో అక్రమ స్టాక్ దొరికింది. ఊరుకొండ మండలంలోని ముచ్చర్లపల్లి గ్రామ శివారులో ఓ రైస్ మిల్లులో ప్రజా పంపిణీ బియ్యాన్ని ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు.
మొత్తం 107.15 క్వీన్టళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కల్వకుర్తి లోని ఎఫ్ సి ఐ గోదాం కు తరలించారు.
ఈ సందర్భంగా ఒక ట్రాక్టర్, రెండు బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నాం అని ఎస్ ఐ విజయకుమార్ తెలిపారు. దాడులలో ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు నర్సింహారాజు, రవి కుమార్, రాంమోహన్ పాల్గొన్నారు.