ఇంజనీరింగ్ డే సందర్భంగా ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ములుగు డి ఈ ఈ ఆఫీస్ కార్యాలయం లో ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు.
భూపాలపల్లి జిల్లా ఎస్ ఈ జనగాం నరేష్, ములుగు డి ఈ ఈ, జి ఎల్ మర్రెడ్డి, కమర్షియల్స్ ఏఈ వేణుగోపాల్, టెక్నీషియన్ ఏఈ మల్లయ్య, ములుగు ఏఈ నరేందర్ రావు, తాడువాయి ఏఈ వేణు కుమార్,
మల్లంపల్లి ఏఈ రాములు నాయక్ లను ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ ఈ జనగాం నరేష్ మాట్లాడుతూ ములుగు లైన్స్ క్లబ్ సభ్యులు సన్మానించడం ఆనందదాయకమని అన్నారు.
డిఈ మార్రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ డే సందర్భంగా ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు అందరినీ సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు లయన్ చుంచు రమేష్, కోశాధికారి లయన్ ముక్కు సుబ్బారెడ్డి, లయన్ మేర్గు రమేష్ ములుగు డిఈ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.